దాదాపు 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో మోస్ట్ అవెయిటింగ్ చిత్రంగా RRR తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న చిత్రం కావడంతో దేశం యావత్తూ ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఎన్టీఆర్, రాంచరణ్ వంటి బిగ్ టాలీవుడ్ స్టార్స్ కలయికలో రాబోతున్న చిత్రం ఇది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. త్వరలోనే కోల్కత్తా షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఎం.ఎం.కీరవాణి ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్ను సిద్ధం చేస్తున్నాడట. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుందట. ఈ ఏడాది ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసి 2020లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాడు రాజమౌళి.
previous post
next post