RRR: బాహుబలి(Bahubali) వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్(Prabhas) పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారి పోవడం తెలిసిందే. ప్రభాస్ తో సినిమా చేయడానికి ఇండియా వైడ్ గా టాప్ మోస్ట్ నిర్మాణ సంస్థలు రెడీగా ఉన్నాయి. ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి… ప్రభాస్ కోసం నిర్మాతలు వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఒక్క నిర్మాతలు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న టాప్ డైరెక్టర్లు కూడా ప్రభాస్ అవకాశం ఇస్తే సినిమా చేయాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ(Radha Krishna) దర్శకత్వంలో రాధేశ్యాం(Radheyshyam) సినిమా చేయడం తెలిసిందే.
ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక ఇటీవల జరిగింది. జనవరి 14 వ తారీకు సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో … “రాధేశ్యాం” వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వస్తున్న వార్తలను కొట్టి పారేసి.. జనవరి 7వ తారీకు నుండి సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రభాస్ పాల్గొనడానికి రెడీ అవుతున్నారట. ఇప్పటివరకు తన సినిమాకి చేయని విధంగా “రాధేశ్యాం”కి నెక్స్ట్ లెవెల్ లో సినిమా ప్రమోషన్ ఉండేలా ప్రభాస్ చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందట. పాన్ ఇండియా నేపథ్యం లో… ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో.. నార్త్ మొదలుకొని సౌత్ వరకు అన్ని ఇండస్ట్రీ లను కవర్ చేయడానికి ప్రభాస్ రెడీ అయ్యాడట.
యూరప్ బ్యాక్ డ్రాప్ లో పిరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో లవ్ స్టోరీ కంటే..సినిమాలో ట్విస్ట్ లు ఎక్కువ ఉన్నట్లు సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో డైరెక్టర్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం “RRR” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉండటంతో జనవరి 7న సినిమా రిలీజ్ కానున్న ఈ క్రమంలో ఆ రోజు రిలీజ్ అయిన వెంటనే ప్రభాస్ ఇంకా తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని.. డిసైడ్ అయ్యాడట. “RRR” అతి పెద్ద భారీ బడ్జెట్ సినిమా కావడంతో పాటు రాజమౌళి(Rajamouli) తెరకెక్కించడంలో ఈ టైంలో “రాధేశ్యాం” సినిమా ప్రమోషన్ చేయటం వల్ల..”RRR”.. బిజినెస్ కి కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు..”RRR”.. జనవరి 7న రిలీజ్ అయిన వెంటనే రాధేశ్యాం ప్రమోషన్ స్టార్ట్ చేయనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.