Pawan-Charan: మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలైతే.. అభిమానుల్లో సందడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి అరుదైన రోజే ఇప్పుడు రాబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎన్టీఆర్తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో చేసిన చిత్రం `ఆర్ఆర్ఆర్`.
డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మించిన ఈ మూవీకి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇందులో బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం వాయిదా పడుతూ పడుతూ ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోంది.
అయితే ఇప్పుడు అదే తేదీన `భీమ్లా నాయక్` సైతం ప్రేక్షకుల ముందుకు రానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో చేసిన సినిమా ఇది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మాతమైన ఈ చిత్రం ఫిబ్రవరి 25న రిలీజై మంచి విజయం సాధించింది.
ఇక ఇప్పుడీ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. మార్చి25న ఈ సినిమాను డిస్నీ+ హాట్స్టార్తో పాటు ఆహాలో రిలీజ్ చేయనున్నారు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మొత్తానికి ఒకే రోజు బాబాయ్, అబ్బాయి సినిమాలు వస్తుండటంతో.. మెగా ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయమని అంటున్నారు.