RRR – Radhe Shyam: ఈ వేసవికి టాలీవుడ్ ఇండస్ట్రీలో పండగ వాతావరణం ఉంటుందని భావించిన ఎంతోమంది అభిమానులకు చివరికి నిరాశే మిగిలేలా ఉంది. కరోనా మహమ్మారి వల్ల ముందుగానే చేసుకున్న ప్లాన్లన్నీ ఫ్లాపయ్యాయి. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న “ఆర్ఆర్ఆర్”సినిమా 2019లో మొదలైంది.అయితే ఈ సినిమాను అప్పట్లో 2020 లో విడుదల చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించారు. 2020 సంవత్సరం కరోన రావటం వల్ల ఈ సినిమా కాస్త వాయిదా పడింది. తరువాత సినిమా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2021 జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శకుడు ప్రకటించారు. అయితే అది కూడా అనుకున్న సమయానికి కాకపోవడం వల్ల ఈ చిత్రాన్ని 2021 అక్టోబర్ 13 కు వాయిదా వేశారు.
అదేవిధంగా ఈ వేసవి సెలవులలో ప్రభాస్ ప్రధాన పాత్రలో పాన్ ఇండియన్ తరహాలో తెరకెక్కించిన “రాధేశ్యామ్”చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ రెండు సినిమా షూటింగ్ పనులు జరగకపోవడంతో ప్రస్తుతం ఈ రెండు సినిమాల దర్శకులు అయోమయంలో పడ్డారు. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేస్తామా లేదా అన్న భావన వీరిలో కలుగుతుంది. సరైన సమయానికి సినిమా విడుదల చేయాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏవో ఒక అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయి.
రాజమౌళిఆర్ఆర్ఆర్, ప్రభాస్ రాధే శ్యామ్:
రాజమౌళి నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాణం చివరి దశలో ఉందని రాజమౌళి ఎన్నోసార్లు ప్రకటించినప్పటికీ అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల చేస్తామా లేదా అన్న అయోమయంలో పడ్డారు. అదేవిధంగా ప్రభాస్ రాధేశ్యామ్ పూర్తయిందని, “ఆది పురుష్”, “సలార్” సినిమాలకు కమిట్ అయిన ప్రభాస్ కు ఇప్పుడు రాధేశ్యామ్ రీ షూట్లతో ప్రభాస్ టెన్షన్ లో ఉన్నారు.ఈ వేసవిలో తమ అభిమాన హీరోల సినిమాలు సందడి చేయనున్నాయి అని ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశ మిగిలెలా ఉంది.2018లో అరవింద సమేత సినిమా ద్వారా సందడి చేసిన ఎన్టీఆర్, ఈ సినిమా ద్వారా ఫుల్ జోష్ ఇవ్వనున్నాడని భావించిన అభిమానులకు నిరాశ మిగిలెలా ఉంది. ఇక ఆచార్య సినిమా ద్వారా మెగా అభిమానులను చరణ్ సందడి చేయనున్నారు. ఈ సినిమాల విడుదల ఆలస్యం కావడంతో ప్రభాస్, ఎన్టీఆర్ అభిమానులు మాత్రం నిరాశ చెందుతున్నట్లు తెలుస్తుంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!