RRR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ పాన్ ఇండియా చిత్రం వాయిదా పడుతూ పడుతూ మార్చి 25న వివిధ భాషల్లో గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో జక్కన్న ఇద్దరు హీరోలతో కలిసి దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే విడుదలకు ముందే ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న ఈ మూవీ.. ఇప్పుడు మరో అరుదైన రికార్డ్ను సృష్టించింది.
అసలు విషయం ఏంటంటే.. తాజాగా ఆర్ఆర్ఆర్ టీం గుజరాత్లోని బరోడాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహం (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ)ని సందర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పటికే నెట్టింట వైరల్గా మారాయి. అయితే ఈ ప్రదేశాన్ని సందర్శించిన మొదటి భారతీయ సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డ్ సెట్ చేసింది.
కాగా, ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కొమురం భీమ్గా ఎన్టీఆర్.. అల్లూరి సీతా రామరాజుగా చరణ్లు కనిపించబోతున్నారు. లీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్.. హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడిలు ఇందులో కీలక పాత్రలు పోషించగా.. కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.
When 🔥 and 🌊 unite 🤝🏼 at the #StatueOfUnity @souindia#RRRTakeOver #RRROnMarch25th pic.twitter.com/U7zhGffRH4
— RRR Movie (@RRRMovie) March 20, 2022
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!