RRR: ‘ఆర్ఆర్ఆర్’(RRR) పాన్ ఇండియా నేపథ్యంలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి(Bahubali) విజయంతో రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి.. తెలుగు భాషలో మాత్రమే కాక దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న అన్ని భాషల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ టైం ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan) కలిసి నటిస్తుండటంతో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమేకాక సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది.
ఓవరాల్ గా ఇండియా వైడ్ గా బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడంతో ఈ సినిమాపై చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరుణంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో అదేవిధంగా మొన్న కోలీవుడ్ ఇండస్ట్రీలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ వేడుక చాలా ఘనంగా జరగడం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్ గా సల్మాన్ ఖాన్.. రాగా కోలీవుడ్ లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో.. ముఖ్య అతిథులుగా కోలీవుడ్ హీరోలు శివ కార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ లు రావటం మనం చూశాం.
ఈ తరుణంలో మలయాళం లో జరుగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్ గా హీరో టోవినో థామస్ అతిథిగా హాజరయ్యారు. ఇటీవలే టోవినో మిన్నల్ మురళి చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. లోకల్ సూపర్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదలై బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో మనోడు తామస్ పేరు ప్రస్తుతం మల్లువుడ్ లో.. మారుమ్రోగుతోంది. ఈ తరుణంలో బాహుబలి డైరెక్టర్ సినిమాకి అతడు రావటం కేరళలో సంచలనం సృష్టించడంతో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జనాలు పోటెత్తారు. రాజమౌళి చాలా తెలివిగా ప్రస్తుతం “మల్లువుడ్” లో మంచి ఫామ్ లో ఉన్న హీరోని.. ప్రీ రిలీజ్ వేడుకకు గెస్ట్ గా.. తీసుకొచ్చి మంచి మార్కెట్ క్రియేట్ చేశారు అని..హైప్ తెచ్చారని తాజా ఈవెంట్ పై ‘ఆర్ఆర్ఆర్’ టీం వ్యవహరించిన దానిపై సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…
ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…
విభిన్న చిత్రాలకు కేరాఫ్గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్…
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…
ఒకప్పటి హీరోయిన్ నమిత పండండి కవలలకు జన్మనిచ్చింది. ఈ గుడ్న్యూస్ను ఆమె నేడు కృష్ణాష్టమి సందర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు…