దర్శక ధీరుడు… అపజయమెరుగని వీరుడు… మన ఎస్ ఎస్ రాజమౌళి. జక్కన్న చెక్కిన సినిమా వస్తుంది అంటేనే ఇండస్ట్రీ వర్గాలతో పాటు, ప్రతి సినీ అభిమాని పక్కా హిట్ అని డిసైడ్ అయిపోతాడు. అందరిలో అంతలా నమ్మకం కలిగించిన రాజమౌళి బాహుబలి లాంటి మాగ్నమ్ ఒపస్ తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ‘ట్రిపుల్ ఆర్’
మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో మొదటిసారి రాబోతున్న ఈ సినిమా ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రీ-ఇండిపెండ్స్ డే బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తుంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన ఈ స్టార్ హీరోలు కలిసి తెరపై కనిపిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనకే గూస్ బంప్స్ తెప్పిస్తున్న రాజమౌళి, చరణ్-ఎన్టీఆర్ ల నుంచి 10 నెలలా కాల్షీట్స్ తీసుకున్నాడట. ఈ పది నెలల్లో అంటే అక్షరాలా 300 రోజుల్లో షూటింగ్ పార్ట్ వరకూ పూర్తి చేసి హీరోలని ఫ్రీ చేసేయాలని రాజమౌళి భావిస్తున్నాడట.
బాహుబలి సినిమాని అయిదేళ్ల పాటు చెక్కిన జక్కన, ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగ్ ని 300 రోజుల్లో పూర్తి చేయడమంటే గొప్ప విషయమే. అనుకున్న టైమ్ కి చిత్రీకరణ పూర్తి చేయడానికి అవసరమైన ప్రణాళిక కూడా రాజమౌళి దగ్గర సిద్ధంగా ఉందని చిత్ర వర్గాల సమాచారం. అంతా బాగుంది కానీ రాజమౌళి లాంటి దర్శకుడికి ఏదీ ఒకపట్టానా నచ్చవు, సంతృప్తి చెందేవరకూ తీసిందే తీసి, చెక్కిందే చెక్కి… సినిమాని ఎప్పటికో కానీ పూర్తి చేయడు, రెండేళ్లలో పూర్తి చేయాలనుకున్న బాహుబలి ఆలస్యం వెనకున్న అసలు కారణం కూడా ఇదే. అయితే అప్పుడు ప్రభాస్ పరిస్థితి వేరు ఇప్పుడు చరణ్-ఎన్టీఆర్ ల పరిస్థితి వేరు. ప్రభాస్ బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ హోదా అందుకుంటే, ఈ ఇద్దరూ స్టార్లయ్యాకే రాజమౌళి సినిమా తీస్తున్నాడు. ప్రస్తుతం వీరి కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది కాబట్టి ‘ట్రిపుల్ ఆర్’ డిలే అయితే తారక్-చరణ్ ల మార్కెట్ కే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. ఇది మనసులో పెట్టుకోనే రాజమౌళి అనుకున్న సమయానికి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాడట. ఇందుకు తగ్గట్లుగానే షెడ్యూల్స్ మధ్య గ్యాప్ ఎక్కువ లేకుండా చూసుకుంటున్న జక్కన, ‘ఆర్ ఆర్ ఆర్’ సెకండ్ షెడ్యూల్ ని జనవరి 21న మొదలుపెట్టబోతున్నాడు. మరి అనుకున్న సమయానికి ‘ట్రిపుల్ ఆర్’ సినిమాని రాజమౌళి పూర్తి చేస్తాడేమో చూడాలి.