Acharya: కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి… చరణ్ మొట్టమొదటిసారి ఫుల్ లెన్త్ లో చేస్తున్న సినిమా “ఆచార్య”. 2019 వ సంవత్సరం చివరిలో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ప్రారంభం కాగా మహమ్మారి కరోనా రాకతో అనేక సార్లు వాయిదా పడుతూ… ఎట్టకేలకు ఈ ఏడాది ప్రారంభంలో షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని ట్రాక్ రికార్డు ఉన్న డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా తెరకెక్కించడం తో.. “ఆచార్య” పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పైగా సినిమాలో చరణ్ దాదాపు 40 నిమిషాల పాటు ప్రధాన పాత్ర పోషించటం… చిరంజీవితో 20 నిమిషాలకు పైగానే.. కనిపించే తరహాలో ఉంటున్న నేపథ్యంలో “ఆచార్య” చూడటానికి మెగా అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
ఏప్రిల్ 29వ తారీకు సినిమా విడుదల అవుతున్న తరుణంలో తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయడానికి నిర్మాత గా చరణ్ డిసైడ్ అయినట్లు సమాచారం. దీనిలో భాగంగా ముందుగా ఈ రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న థియేటర్లలో “ఆచార్య” ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ కి సంబంధించి రన్ టైం వివరాలు తాజాగా బయటకు రావడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే దాదాపు రెండు నిమిషాల 35 సెకండ్ల పాటు… “ఆచార్య” ట్రైలర్ ఉందనున్నట్లు సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం.
దీంతో ఈ రోజు సాయంత్రం ట్రైలర్ విడుదల కానున్న తరుణంలో… యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో లైకులు.. వ్యూస్… వచ్చే విధంగా ఫ్యాన్స్ ఏర్పాట్లు చేసుకున్నారు. చరణ్ సరసన పూజా హెగ్డే చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా సినిమాలో నటించడం జరిగింది. విలన్ పాత్ర సోనూసూద్ చేశారు. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత మణిశర్మ చిరంజీవి సినిమాకి మ్యూజిక్ అందించడంతో “ఆచార్య” గ్యారెంటీ హిట్ అని సెంటిమెంట్ పరంగా.. అభిమానులు భావిస్తున్నారు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!