`బాహుబలి` స్టార్ ప్రభాస్ తదుపరి చేస్తున్న సినిమా సాహో. యు.వి.క్రియేషన్స్ బ్యానర్పై సుజిత్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం సినిమాను ఆగస్ట్ 15న విడుదల చేస్తారని వార్తలు వినపడుతున్నాయి. కానీ విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయంటున్నారు. ఈ సినిమా విడుదలకు దగ్గర పడక ముందే సినిమా బిజినెస్కు పిచ్చ క్రేజ్ ఏర్పడింది. ఎందుకంటే ఈ సినిమా ఓవర్ సీస్ బిజినెస్కు దక్కిన ఫ్యాన్సీ రేటే అందుకు నిదర్శనంగా నిలిచింది. వివరాల్లోకెళ్తే.. యు.ఎ.ఇ. డిస్ట్రిబ్యూటర్ పార్స్ ఫిలింస్ ఈ సినిమాను 42 కోట్ల రూపాయలు చెల్లించి ఓవర్ సీస్ హక్కులను సొంతం చేసుకుంటుందట. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, జాకీష్రాఫ్, మందిరా బేడి, నీల్ నితిన్ వంటి భారీ తారాణం సంగీతం అందిస్తున్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!