యంగ్ రెబల్స్టార్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ `సాహో` ఆగస్ట్ 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో భారీ రేంజ్లో విడుదల కానుంది. శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో మందిరాబేడి, నీల్ నితిన్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేసిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపూ రూ.350 కోట్లు ఖర్చుతో రూపొందిన ఈ సినిమా రెవెన్యూను వీలైనంత త్వరగా.. ముఖ్యంగా మూడు రోజుల్లో రాబట్టుకునేలా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం నుండి టికెట్ ధరను మూడు రోజుల పాటు రూ.200 ఉండేలా పర్మిషన్ తెచ్చుకున్నారని సమాచారం. ఇప్పుడు తెలంగాణలో కూడా టికెట్ ధరను తొలి మూడు రోజులు ఎక్కువగా ఉండేలా పర్మిషన్ తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట. మరి కె.సి.ఆర్ ప్రభుత్వం ఏమంటుందో వేచి చూడాలి. సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ నిర్మించారు.
previous post
next post