Sai Dharam Tej: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ కమర్షియల్ సినిమాలో ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్నట్టు తాజా సమాచారం. ఇప్పటికే మెగా మల్టీస్టారర్గా రూపొందిన ఆచార్య సినిమా ఈ నెలలో 29న వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్
కానుంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటించాడు. ఈ మెగా మల్టీస్టారర్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ ను బట్టి మరికొన్ని మెగా హీరోల నుంచి మల్టీస్టారర్ సినిమాలు వస్తాయని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆచార్య రిలీజ్కు ముందే మరో మెగా మల్టీస్టారర్ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయట. తాజాగా దీనికి సంబంధించిన న్యూస్ ఒకటి వచ్చి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇది కూడా మలయాళ హిట్ మూవీ అంటున్నారు. ఇప్పటికే మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోషియం సినిమా ఆధారంగా భీమ్లా నాయక్ సినిమా వచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. ఇక చిరంజీవి కూడా మలయాళ బ్లాక్ బస్టర్ లూసీఫర్ రీమే్లో నటిస్తున్నారు.
Sai Dharam Tej: మెగా అభిమానుల్లో మాత్రం ఈ వార్త ఉత్సాహాన్ని నింపుతోంది.
గాడ్ ఫాదర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన బ్రో డాడీ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో వెంకీ – రానా నటిస్తారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నాగార్జున – అఖిల్ నటించనున్నట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడు బ్రో డాడీ తెలుగు రీమేక్లో మెగాస్టార్ చిరంజీవి – సాయి ధరమ్ తేజ్
నటించనున్నట్టు టాక్ మొదలైంది. ఇందులో చిరుకి కొడుకుగా సాయి నటించనున్నాడట. ఇది ఎంత వరకు నిజమోగానీ మెగా అభిమానుల్లో మాత్రం ఈ వార్త ఉత్సాహాన్ని నింపుతోంది.