మెగా ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరోలు వచ్చినా కూడా మెగా అభిమానులు వాళ్లని ఆదరిస్తూనే ఉంటారు. ఈ కోవలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో అతితక్కువ టైంలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. మొదటి మూడు చిత్రాలతో మంచి హిట్స్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ తనకంటూ స్పెషల్ మార్కెట్ సృష్టించుకోని సుప్రీమ్ హీరోగా ఎదిగాడు.
అయితే కెరీర్ స్టార్టింగ్ లో మంచి హిట్స్ ఇచ్చిన తేజ్, నెమ్మదిగా ఫ్లాప్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు. మార్కెట్ దెబ్బతినడం మొదలయ్యింది. దీంతో అసలు సాయి ధరమ్ తేజ్ నుంచి వస్తున్న సినిమాలని మెగా ఫ్యాన్స్ కూడా లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు ఇలాంటి సమయంలో ఒక్క హిట్ కోసం ఎదురు చూస్తున్న తేజ్ కి వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కిషోర్ తిరుమల కలిశాడు. చిత్రలహరి అనే సినిమాని అనౌన్స్ చేశారు.
ఈ ఇద్దరికీ హిట్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ అయిన మైత్రి మూవీ మేకర్స్ కూడా కలవడంతో చిత్రలహరి సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. హలో ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా నుంచి సంక్రాంతి కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఒక సర్కిల్ లో చిత్రలహరి టైటిల్ ని పెట్టి ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసి క్యూరియాసిటీ పెంచడంలో సక్సస్ అయిన చిత్ర యూనిట్, ఐదక్షరాలు… అయిదు పత్రాలు అంటూ మైత్రి మూవీ మేకర్స్ చిత్రలహరి ప్రమోషన్స్ ని మొదలు పెట్టింది. మరి ఈ ఐదు వెనకున్న మతలబు ఏంటో వాళ్లకే తెలియాలి. ఏప్రిల్ 12న ఈ సినిమా విడుదల కాబోతుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడంతో సమ్మర్ లో సాయి ధరమ్ తేజ్ రావడం కన్ఫార్మ్ అయ్యింది. కెరీర్ కష్టాల్లో ఉన్న సుప్రీమ్ హీరోకి చిత్రలహరి హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మరి ఈ సినిమాతో తేజ్ హిట్ అందుకోని బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.