టాలీవుడ్ లో సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్ చేసిన ప్రయోగం సత్ఫలితాలనే ఇస్తోందని చెప్పాలి. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ద్వారా ధియేటర్లలో ఎంటరైన సాయి తేజ్ మంచి హిట్ కొట్టాడని చెప్పాలి. నిజానికి తొమ్మిది నెలలుగా కరోనా మహమ్మారి వల్ల ప్రజలకు ఎంటర్ టైన్మెంట్ లేకుండా పోయింది. ఓటీటీల్లో రిలీజ్ అయిన సినిమాలే దిక్కయ్యాయి. పైరసీల్లో సినిమాకు ధియేటర్లలో సినిమాలకు పూర్తి తేడాను కరోనా మహమ్మారి చూపించిందని చెప్పాలి. ఎప్పుడెప్పుడు ధియేటర్లలో సినిమా చూద్దామా అని ఎదురు చూసిన సినీ ప్రేమికులకు సోలో బ్రతుకే సో బెటర్ సినిమా స్వాగతం చెప్పింది. మంచి టాక్ తో దూసుకుపోతోంది.
డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తోంది. మూడు రోజులుగా స్టడీ కలెక్షన్లతో సినిమా రన్ అవుతోంది. తెలంగాణలో ఇప్పటివరకూ 4 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. 50 శాతం ఆక్యుపెన్సీతోనే ఈ స్థాయి కలెక్షన్లు రాబట్టం విశేషమే. వైజాగ్ రీజియన్ లో ఈ సినిమా 1కోటి 50లక్షల వరకూ వసూలు చేసింది. సీడెడ్ లో 2కోట్లు మార్కు చేరుకుందని తెలుస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 11 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి డీసెంట్ రన్ తో దూసుకుపోతోందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు ధియేటర్లకు వస్తారా అనే ప్రశ్నకు కొంత సమాధానం లభించిందనే చెప్పాలి. సంక్రాంతి వరకూ దాదాపు మరే సినిమాలు కూడా రిలీజ్ కు సిద్ధంగా లేవు.
అప్పటివరకూ సోలో బ్రతుకే సో బెటర్.. సోలోగానే రన్ అవుతుందని అంచనా వేస్తున్నారు సినీ పండితులు. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో ధియేటర్లు రన్ కావడానికి మరికొంత సమయం పట్టేలానే ఉంది. ఈ సమయంలో కూడా మంచి రెవెన్యూ సాధించడం ఈ సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. కొన్నాళ్లపాటు వరుస ఫ్లాపుల్లో ఉన్న సాయి ధరమ్ తేజ్ చిత్రలహరితో విజయాన్ని, ప్రతిరోజూ పండగే సినిమాతో సూపర్ హిట్ ను సాధించాడు. సోలో బ్రతుకే సో బెటర్ ద్వారా ఈ సుప్రీం హీరో మళ్లీ హ్యాట్రిక్ కొట్టాడని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.