Sai dharam tej: అక్టోబర్లో యాక్సిడెంట్లో తీవ్ర గాయాలైన మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ఆసుపత్రిలో చికిత్స పొంది సేఫ్గా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ ఎలా ఉన్నాడో అని అభిమానులందరూ ఎంతో కంగారు పడ్డారు. వారి కంగారు తగ్గించడానికి మెగా ఫ్యామిలీ మళ్ళీ దీపావళి పండుగ సందర్భంగా సాయి తేజ్ను సోషల్ మీడియా ద్వారా చూపించి సర్ప్రైజ్ చేశారు. ఆ ఫొటోలో సాయి తేజ్ను చూసిన మెగా అభిమానులు మాత్రమే కాదు ప్రేక్షకులందరూ కూడా డబుల్ ఎనర్జీతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడని అవధులు లేని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
ఇక అప్పటి నుంచి సాయి తేజ్ కొత్త చిత్రం ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ ప్రకటన త్వరలో రాబోతుందని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. ఇటీవలే మాచో హీరో గోపీచంద్ – తమన్నా జంటగా సీటీమార్ సినిమాను తెరకెక్కించి హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ఓ కొత్త ప్రాజెక్ట్కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందట. లాంగ్ గ్యాప్ తర్వాత సంపత్ నంది సీటీమార్ సినిమాతో హిట్ అందుకున్నాడు. నెక్స్ట్ సినిమాగా సాయి తేజ్తో ప్రాజెక్ట్ ఓకే అయినట్టు సమాచారం.
Sai dharam tej: ఇంతక ముందే సాయి తేజ్ కమిటయ్యాడు
ఈ మూవీని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్టు తెలుస్తోంది. గతంలో మైత్రీ వారు సాయి తేజ్ హీరోగా చిత్రలహరి సినిమాను నిర్మించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమా ఉప్పెన సినిమాను నిర్మించింది మైత్రీ వారే. ఇప్పుడు మరోసారి ఈ మెగా మేనల్లుడుతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయాయని న్యూ ఇయర్లో అధికారికంగా ప్రాజెక్ట్ను అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే మరో దర్శకుడికి ఇంతకముందే సాయి తేజ్ కమిటయ్యాడు. అది కూడా త్వరలో కన్ఫర్మేషన్ రానుంది. ఇక దేవాకట్టతో చేసిన గత చిత్రం రిపబ్లిక్ మంచి హిట్ సాధించిన సంగతి తెలిసిందే.