Pawan Kalyan : సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోయిన్ లలో సాయిపల్లవి కూడా ఒకరు. తమిళంలో ప్రముఖ స్టార్ సూర్య, ధనుష్ వంటి హీరోల సరసన నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న సాయిపల్లవికి వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తన సహజ నటన ద్వారా తెలుగులో ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అందరినీ ఫిదా చేసింది. అయితే తెలుగులో సాయిపల్లవి కేవలం నాచురల్ స్టార్ నాని సరసన జత కట్టింది. ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించే అవకాశం ఈ బ్యూటీకి రాలేదని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా మల్యాల సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కొషియుమ్ తెలుగు రీమేక్ చేయనున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి నటించనున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో సాయిపల్లవి నటిస్తోందని సమాచారం వినబడుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు.
పవన్, రానా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి మరికొన్ని రోజులలో షూటింగులో పాల్గొంటున్నారని సమాచారం. ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర చిన్నదే అయినప్పటికీ ఇందులో నటించడానికి మాత్రం భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా వినబడుతోంది. మొత్తానికి సాయి పల్లవి తన సహజ నటన ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. త్వరలోనే ఇతర హీరోలతో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకుందనే విషయంలో ఏ మాత్రం సందేహ పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ శృతిహాసన్ జంటగా తెరకెక్కిన వకీల్ సాబ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే సాయి పల్లవి నాగచైతన్య లవ్ స్టోరీ ఈ వేసవిలో ప్రేక్షకుల ముందు సందడి చేయనున్నాయి.