Rana-Sai Pallavi: రానా దగ్గుబాటి, సాయి పల్లవి తొలిసారి జంటగా నటించిన చిత్రం `విరాట పర్వం`. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై దగ్గుబాటి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. ప్రియమణి, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం అనేక అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. నక్సలిజం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమ కథ ఇది. ఇటీవలె బయటకు వచ్చిన ట్రైలర్.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ప్రస్తుతం మేకర్స్ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె సినిమా గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. అలాగే రానా వ్యక్తిత్వం ఎలాంటిదో నిర్మొహమాటంగా బయటపెట్టేసింది.
సాయి పల్లవి మాట్లాడుతూ.. `రానా డౌన్ టూ ఎర్త్ పర్సన్. మొన్న కర్నూలులో జరిగిన ట్రైలర్ ఈవెంట్లో వర్షం పడుతుంటే ఆయన నాకు గొడుగు పట్టుకోవడం చూస్తేనే మీకు అర్థమైపోతుంది. తన రియల్ క్యారెక్టర్ అలానే ఉంటుంది. హీరో ఇమేజ్ని ఆయన ఎప్పుడూ పట్టించుకోరు. సెట్ లో కూడా నాకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు. షూటింగ్ ఉన్నప్పుడు నేను సేఫ్గా ఇంటికి వెళ్లేంత వరకు కేర్ తీసుకునేవారు. ఆయనది చాలా గొప్ప వ్యక్తిత్వం` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారియి.