సినిమా హీరో, హీరోయిన్లను చూస్తే ఫ్యాన్స్, ఆడియన్స్ కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. తెరపై నటించే వారిని ప్రత్యక్షంగా చూస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఆమధ్య హీరో కార్తికేయ.. చిరంజీవి గారిని దగ్గరగా చూసిన అనుభవాన్ని పంచుకుంటూ భావోద్వేగమయ్యాడు. నటీనటులకు కూడా తోటి నటీనటులపై అటువంటి ఫీలింగే ఉంటుందని నిరూపించాడు. కొందరు హీరోలు, హీరోయిన్లపై ఇతర నటులపై ఉండే అభిప్రాయమే ఇందుకు ఉదాహరణ. వీరిలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కూడా ఉన్నారు. ఇటివల ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కు ఇలా సమాధానాలు చెప్పింది.
అల్లు అర్జున్ పై మీ అభిప్రాయం ఏంటని అడిగితే.. ‘మంచి డ్యాన్సర్’ అని కితాబు ఇచ్చింది. మహేశ్ అనగానే.. కాస్త లెంగ్తీగానే సమాధానం చెప్పింది. ‘మహేశ్ చార్మింగ్ లుక్స్ నన్ను ఎంతో ఆకట్టుకుంటాయి. ఆయన స్కిన్ టోన్ అద్భుతం. ఒక్కోసారి ఆయన స్కిన్ టోన్ ను జూమ్ చేసి మరీ చూస్తా. సాధారణ వ్యక్తులకు అటువంటి స్కిన్ టోన్ ఉండదని అనుకుంటూ ఉంటా. చాలా స్టైలిష్ గా కూడా ఉంటారు’ అని చెప్పింది. దీంతో తెలుగు హీరోలపై చెప్పిన అభిప్రాయాల్లో మహేశ్ గురించి చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్ అయింది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ పొంగిపోతున్నారు. తమిళ హీరో ధనుష్ పై ‘వర్క్ పట్ల నిబద్దత ఉన్న నటుడు. తన పార్ట్ షూటింగ్ పై ఎంతో శ్రద్ధగా ఉంటాడు’ అని చెప్పుకొచ్చింది.
తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయకపోయినా.. చేసిన సినిమాలతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఫిదా ఆమెను యూత్ కి, ఆడియన్స్ కి దగ్గర చేసింది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా చేస్తున్న ‘లవ్ స్టోరీ’, రానాతో ‘విరాటపర్వం’ సినిమాల్లో నటిస్తోంది. ఆమె నటించిన పావ కాధైగల్ చిత్రం డిసెంబర్ 18న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతోంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!