కెరీర్ ప్రారంభంలో `ఫిదా`, `ఎం.సి.ఎ` చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న సాయిపల్లవి తర్వాత `కణం`, `మారి2`, `పడిపడి లేచె మనసు` చిత్రాలతో పరాజయాలను మూటగట్టుకున్నారు. ఈ శుక్రవారం విడుదలైన `ఎన్.జి.కె` కూడా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు తెలుగులో ఈమె `విరాటపర్వం 1992`, చిత్రంలో నటించాల్సి ఉంది. దీంతో టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ `ఆర్ ఆర్ ఆర్`లో కూడా నటించనుందని వార్తలు వినపడ్డాయి. ఒకప్పుడు ఈ చిత్రంలో కీలక పాత్రలో నిత్యా మీనన్ నటిస్తుందని వార్తలు వినిపించాయి. మరి నిత్యా నటిస్తుందో లేదో తెలియడం లేదు. కానీ ఓ కీలక పాత్ర కోసం చిత్ర యూనిట్ సాయిపల్లవిని సంప్రదించారని టాక్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్, బాలీవుడ్ తారలు అజయ్ దేవగణ్, అలియా భట్, సముద్రఖని తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి పాత్ర ఎంత కీలకం కానుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
previous post
next post