మెగా క్యాంప్ హీరో సాయితేజ్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో `ప్రతిరోజూ పండగే` సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సాయితేజ్ చేయబోయే సినిమాలకు సంబంధించి పలు వార్తలు వినపడుతున్నాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం సాయితేజ్ తమిళ దర్శక నిర్మాత వెంకట్ ప్రభుతో కలిసి ఓ సినిమా చేయబోతున్నారని సినీ వర్గాల సమాచారం. దర్శకుడు అనీల్ సుంకర ఇటీవల చెన్నై వెళ్లినప్పుడు వెంకట్ ప్రభుని కలిశాడట. ఆ సందర్భంలో వెంకట్ ప్రభు ఆసక్తికరమైన పాయింట్ ఒకటి చెప్పాడట. ఆ పాయింట్ అనీల్ సుంకరకి బాగా నచ్చిందట. సాయితేజ్ని అనీల్ సుంకర కలిసి అదే లైన్ని వినిపిస్తే తనకు కూడా నచ్చడంతో అనీల్ సుంకర ప్రాజెక్ట్ను ట్రాక్ ఎక్కించడానికి రెడీ అయిపోయాడని టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలున్నాయట.
previous post
next post