Chiranjeevi: మీ కోసం వచ్చేస్తున్నా అంటూ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేశారట. ఎందుకో తెలుసా..తెలియాలంటే అసలు మ్యాటర్లోకి వెళ్ళాల్సిందే. ఖైదీ నంబర్ 150 తర్వాత వరుసగా సినిమాలను లైన్లో పెట్టిన మెగాస్టార్ ఒకేసారి రెండు మూడు సినిమాల షూటింగ్స్లోనూ పాల్గొంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో చిరుతో చరణ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా ఇండస్ట్రీలో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అని దర్శకుడు కొరటాల శివ చాలా నమ్మకంగా చెబుతున్నారు.
అలాంటి సరికొత్త రికార్డులను మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా కూడా క్రియేట్ చేయనుందని అందరూ చెప్పుకుంటున్నారు. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన లూసీఫర్ సినిమాకు తెలుగు అఫీషియల్ రీమేక్ గాడ్ ఫాదర్. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కిలక పాత్ర పోషిస్తున్నారు. నయనతార, సత్య దేవ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి కావచ్చిందట. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది.
Chiranjeevi: చిరు, సల్మాన్ స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడమే చాలా కష్టం.
సల్మాన్ ఖాన్ త్వరలో నేను హైదరాబాద్ వస్తున్నాని మెగాస్టార్కు కాల్ చేశారట. గాడ్ ఫాదర్ షూటింగ్లో జాయిన్ అయ్యేందుకే సల్మాన్ వచ్చే నెల హైదరాబాద్ రాబోతున్నారట. ఇక్కడ వారం రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొంటారని తెలుస్తోంది. ఇక ఈ షూటింగ్లో చిరు, సల్మాన్ మీద కీలక సన్నివేశాలను, ఓ సాంగ్ను పూర్తి
చేయబోతున్నట్టు సమాచారం. మెగాస్టార్ ఫ్యామిలీకి సల్మాన్ అత్యంత సన్నిహితుడు. చిరు, చరణ్లతో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్తోనూ సన్నిహితంగా ఉంటారు. అందుకే గాడ్ ఫాదర్ సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేయమని అడగగానే క్షణం ఆలోచించకుండా ఓకే చెప్పారు. మరి ఈ స్టార్స్ స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుందో
ఊహించుకోవడమే చాలా కష్టం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?