Salman Khan: ప్రస్తుతం చాలావరకు సినిమా నిర్మాణానికి సంబంధించి సౌత్ ఇండియా టాలెంట్ హవా కొనసాగుతుంది. ఈత బాలీవుడ్(Bollywood) స్టార్ హీరోలు దక్షిణాది సినిమా రంగానికి చెందిన దర్శకులతో, మ్యూజిక్ డైరెక్టర్ లతో… టెక్నీషియన్ లతో పనిచేయడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan). ఒక విధంగా చెప్పాలంటే బాలీవుడ్ లో ఇంకా సల్మాన్ టైం అయిపోయింది అని అనుకున్న టైంలో.. అతని ఆదుకుంది సౌత్ ఇండియా సినిమా. తెలుగులో మహేష్(Mahesh Babu) నటించిన “పోకిరి”(Pokiri) సినిమాని హిందీలో “వాంటెడ్”గా(Wanted) రీమేక్ చేసి సల్మాన్ హిట్ ట్రాక్ ఎక్కాడు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ఆ తర్వాత వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతూ వెనక్కి తిరిగి చూడలేదు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ “కబీ ఈద్ కబీ దీవాలి” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో పాటు పూజా హెగ్డే ఇంకా రామ్ చరణ్, వెంకటేష్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకి రెండు మంచి మాస్ మసాలా సాంగ్స్ అందించాలని దేవిశ్రీప్రసాద్ కి సల్మాన్ ఆఫర్ ఇచ్చారట. అయితే దేవిశ్రీప్రసాద్ ఇటీవల కొన్ని సాంగ్స్ కంపోజ్ చేసి.. సల్మాన్ ఖాన్ కి వినిపించగా ఏది కూడా నచ్చలేదు అని టాక్.
అంత మాత్రమే కాక దేవి శ్రీ ప్రసాద్ నీ పక్కన పెట్టేసి “కేజిఎఫ్” మ్యూజిక్ డైరెక్టర్ రవి బాశ్రుర్ కి ఇవ్వడం జరిగిందంట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ మ్యూజిక్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్.. ఇప్పుడు.. గతంలో మాదిరిగా రాణించలేకపోతున్నారని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగులో తమన్ తర్వాత తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ హవా కొనసాగుతోంది. రేసులో దేవిశ్రీప్రసాద్ వెనక్కి తగ్గిపోయాడు అని జనాలు అంటున్నారు.