Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోల అందరి కంటే మెగాస్టార్ చిరంజీవి మంచి స్పీడ్ మీద ఉన్నారు. చేతి నిండా సినిమాలతో షూటింగ్ లలో బిజీ బిజీగా గడుపుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య వచ్చే నెలలో విడుదల కానుండగా.. నెక్స్ట్ చేయబోయే సినిమాకి సంబంధించి షూటింగ్ చిరంజీవి ఇటీవల స్టార్ట్ చేయడం జరిగింది. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఓ ఓ కీలక పాత్రలో బాలీవుడ్ కండలవీరుడు నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సినిమాల్లో సల్మాన్ ఖాన్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించాలని.. ముంబైలో మొదటి షెడ్యూల్ ప్లాన్ చేయడం జరిగింది.
దీంతో ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది. తాజాగా షూటింగ్ లో పాల్గొన్న సల్మాన్ .. మెగాస్టార్ చిరంజీవి కి వార్నింగ్ ఇవ్వటం జరిగింది అని లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది. విషయంలోకి వెళితే సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న క్రమంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి చిరంజీవి రెడీ అయినట్లు.. ఏంటి సల్మాన్ సీరియస్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం చిరంజీవి ఫ్యామిలీ తో నా సన్నిహితం తోనే సినిమా చేస్తున్నట్లు డబ్బులు తీసుకోవడానికి సల్మాన్ ముందుకు రాన్నట్లు… డబ్బులు ఇస్తాను అంటే వెంటనే సెట్ నుండి వెళ్ళిపోతా అని… చిరంజీవికి కరాఖండిగా చెప్పినట్లు.. లేటెస్ట్ టాక్ బాలీవుడ్ లో వినపడుతోంది.
సల్మాన్ ఖాన్ కి మెగాస్టార్ ఫ్యామిలీ తో ఫస్ట్ నుండి మంచి రిలేషన్ ఉంది. ఇటువంటి తరుణంలో సల్మాన్ చేస్తున్న గెస్ట్ రోల్ పరంగా వేరే ఈ విధంగా చూసుకుంటే చాలా కోట్లలో రెమ్యూనరేషన్ వస్తుంది. కానీ కొన్ని కోట్లు డబ్బులు వద్దని అభిమానంతో చిరంజీవి సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి సల్మాన్ ముందుకు రావడం పట్ల మెగా అభిమానులు నిజంగా గ్రేట్ అని అంటున్నారు. కాగా తాజాగా ముంబైలో జరుగుతున్న షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!