బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, స్టార్ డైరెక్టర్ అబ్బాస్ అలీ కలయికలో వస్తున్న మూడో సినిమా ‘భారత్’. ఓడ్ టు మై ఫాదర్ అనే కొరియన్ హిట్ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భారత్ టీజర్ రిలీజ్ అయ్యింది. పార్టీషన్ ఆఫ్ ఇండియా నుంచి మొదలు పెట్టి ఇప్పటి వరకూ సాగే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. ఫ్లాప్ అనేదే తెలియని అబ్బాస్ అలీ రాసే కథాకథనాలు భారత్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచే అవకాశం ఉంది. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది.
previous post
next post