Samantha: ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యే భర్త నాగచైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఎంతో అనోన్యంగా కనిపిస్తూ టాలీవుడ్లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్గా గుర్తింపు తెచ్చుకున్న సామ్, చైలు పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం కెరీర్పైనే దృష్టి పెట్టిన సామ్.. వరుస ప్రాజెక్ట్స్ను టేకప్ చేస్తూ మునుపటి కంటే జ్యూష్తో దూసుకుపోతోంది.
ఇటీవల విడుదలైన పాన్ ఇండియా చిత్రం `పుష్ప` కోసం తొలిసారి ఐటెం భామగా కూడా మారింది. ఇందులో సామ్ చేసిన `ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా..` సాంగ్ ఎంతలా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో రికార్డులను కొలగొట్టిన ఈ సాంగ్తో సమంత పేరు ఆల్ ఇండియా లెవల్లో మారుమోగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆ సాంగ్పై సమంత ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
తాజాగా ముంబయిలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సమంత మీడియాతో మాట్లాడుతూ.. `ఊ అంటావా పాటకు ఇంత భారీ స్థాయిలో ఆదరణ లభిస్తుందని ఊహించలేదు. ఇది తెలుగు పాట అయినా కూడా పాన్ ఇండియా లెవల్లో హిట్టయింది. జనాలు అంతకుముందు నేను చేసిన సినిమాలన్నీ మర్చిపోయారు. ఊ అంటావా మావా పాటనే గుర్తు పెట్టుకుని చాలా బాగా చేశానని చెబుతున్నారు. ఇది నిజంగా ఆనందించే విషయం` అంటూ చెప్పుకొచ్చింది.
దీంతో ఇప్పుడీమె కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. సినిమాల విషయానికి వస్తే.. గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం` సినిమాను పూర్తి చేసిన సమంత ప్రస్తుతం ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ బ్యానర్ `యశోద` అనే మూవీ చేస్తోంది. ఇది కాకుండా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆమె చేతిలో ఉన్నాయి.