Samantha- Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్లో శివ నిర్వాణ దర్వకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం ఫస్ట్ లుక్ను మరో రెండు రోజుల్లో మే 16న విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అంతా అనుకున్నట్లే ఈ సినిమాకు ‘ఖుషి’ అనే టైటిల్ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ సినిమాను అన్ని దక్షిణాది భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇటీవల కాశ్మీర్లో ఈ చిత్రం తొలిషెడ్యూల్ ప్రారంభమైంది. ఆ సెట్లోనే సమంత బర్త్డేను సర్ప్రైజ్గా ప్లాన్ చేశాడు విజయ్ దేవరకొండ.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
క్రిస్మస్కు ‘ఖుషీ’గా వస్తున్న సమంత, విజయ్
పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ తమ 19వ సినిమాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమా ‘ఖుషి’ టైటిల్ ని వాడేశారు. ఈ పోస్టర్లో విజయ్ దేవరకొండ సిగరెట్ తాగుతూ కూల్ లుక్లో ఉండగా.. సమంత పెళ్ళి కూతురు గెటప్లో ఉంది. ఇక, ఈ వీడియోలో ‘ఖుషి.. నువ్వు కనపడితే.. ఖుషి.. నీ మాట వినపడితే’ అనే పాటను కూడా హమ్ చేశారు. మొత్తంగా ఈ వీడియోలో బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ అదిరిపోయేలా ఉన్నాయి. దీంతో ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విడుదలకు సిద్ధంగా లైగర్..
కాశ్మీర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఆర్మీ ఆధికారిగా కనిపించనున్నాడు. క్రిస్మస్ను కానుకగా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. ప్రస్తుతం విజయ్ నటించిన లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇదే కాంబోలో జనగణమన తెరకెక్కనుంది. లైగర్ విడుదల తర్వాతే ఈ చిత్రం షూటింగ్ను ప్రారంభించనుంది. ఈ క్రమంలో విజయ్.. శివ నిర్వాణతో సినిమాను పట్టాలెక్కించాడు.