Samantha: హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురికావడం తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ నెల చివరిలో ఈ వ్యాధికి గురైనట్లు.. తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా సమంత స్వయంగా పోస్ట్ పెట్టడం సంచలనం సృష్టించింది. దీంతో అప్పటినుండి చికిత్స తీసుకుంటూ మంచానికి పరిమితమైన సమంత ఇటీవల మెల్లమెల్లగా రికవరీ అవుతుంది. సామ్ కోలుకోవాలని అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖులు తమ సానుభూతిని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే.. కొద్దిరోజులనుండి సమంత మళ్ళీ రికవరీ అయ్యి వర్కౌట్లు చేయటంతో పాటు జలపాతాల దగ్గర ఫోటోలు దిగుతూ మళ్లీ తన మునుపటి అందాన్ని దక్కించుకుంది.
చికిత్స తీసుకుంటున్న సమయంలో సమంత ఫేస్ లో గ్లో మొత్తం… పోగా అప్పట్లో భారీ ఎత్తున నెగటివ్ కామెంట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు సమంత గతంలో మాదిరిగానే యధావిధిగా గ్లామర్ తో మెరిసిపోతోంది. అంతేకాకుండా తాను ఒప్పుకున్న ప్రాజెక్టు ఆగిపోవడంతో ఇప్పుడు మళ్ళీ వాటిని మొదలు పెట్టడానికి.. రెడీ అయిపోయింది. దీనిలో భాగంగా శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ తో “ఖుషీ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు సగానికి పైగా కంప్లీట్ అయిన సమయంలో… సమంతా అనారోగ్యానికి గురి కావటం విజయ్ దేవరకొండ అభిమానులను ఎంతగానో నిరుత్సాహానికి గురి చేసింది. పైగా వరుస ప్లాపులు రావడంతో ఇదే సమయంలో సినిమా ఆగిపోవడంతో.. కొద్దిగా ఫీలయ్యారు. అదే సమయంలో సమంత త్వరగా కోలుకోవాలని కూడా కోరుకున్నారు. హీరో విజయ్ దేవరకొండ సైతం సామ్ పూర్తి ఆరోగ్యంగా కోలుకొని రావాలని.. అన్నారు.
అయితే ఇప్పుడు సమంత మళ్లీ సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అయింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు కూడా తెలియజేసింది.”ఖుషి సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది. విజయ్ దేవరకొండ అభిమానులకి నాక క్షమాపణలు” అని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. దీంతో సామ్ కామెంట్ పై అభిమానులతో పాటు హీరో విజయ్ దేవరకొండ సైతం.. ముందు ఆరోగ్య మీద దృష్టి పెట్టాలని రిప్లై ఇచ్చారు. మేమంతా నువ్వు పూర్తి ఆరోగ్యం మరియు పెద్ద చిరునవ్వుతో తిరిగి రావాలని ఎదురు చూస్తున్నామని అన్నారు. ఇదిలా ఉంటే గతంలో మహానటి సినిమాలో విజయ్ దేవరకొండ తో సమంత చిన్నపాటి పాత్ర చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ చాలా సంవత్సరాలకు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తూ ఉండటంతో… “ఖుషి” పై భారీ అంచనాలు నెలకొన్నాయి.