Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు బాలీవుడ్లో కూడా తన సత్తా చాటి స్టార్ హీరోయిన్గా జెండా పాతాలని మంచి పట్టుదలతో ఉంది. ప్రస్తుతం సమంత వరుస ప్రాజెక్ట్స్కు సైన్ చేస్తూ చాలా బిజీగా ఉంది. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన పౌరాణిక చిత్రం శాకుంతలం శరవేగంగా వీఎఫెక్స్ వర్క్ను జరుపుకుంటోంది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ సమంతకు జంటగా నటిస్తున్నాడు. అల్లు అర్హ, వర్షిణి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఇక తమిళ మల్టీస్టార్ కథువాకుల రెండు కాదల్ తెలుగులో కణ్మణి రాంబో ఖతీజా పేరుతో రాబోతోంది. ఇక యశోద చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తైంది. ఏప్రిల్ నెలవరకు షూటింగ్ పూర్తవుతుందని జూన్ లేదా జూలైలో ఈ సినిమాను కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత హాలీవుడ్ సినిమాను మొదలుపెట్టబోతోంది. ఈ ఏడాది చివరిలో ఈ హాలీవుడ్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత మరో సినిమాను మొదలుపెట్టాల్సి ఉంది.
Samantha: ఈ సంవత్సరం 5 సినిమాలు…?
ఇవి ఇలా ఉంటే ఇటీవల ది ఫ్యామిలీ మేన్ సీజన్ 2 దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సినిమా చేయబోతునట్టు దాదాపు కన్ఫర్మ్ అని తెలుస్తోంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఇవేనట. ముంబైతో పాటు యూరప్లలో ఈ సినిమా షూటింగ్ను కంప్లీట్ చేస్తారని సమాచారం. అంతేకాదు జూన్ నెలలో చిత్రీకరణ ప్రారంభించి సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకు కంప్లీట్ చేసి ఈ ఏడాది చివరిలోగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు బాలీవుడ్ మీడియా సమాచారం. దీనిని బట్టి చూస్తే సమంత నుంచి ఈ సంవత్సరం శాకుంతలం, తమిళ మల్టీస్టారర్, యశోద, అలాగే హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు వచ్చేస్తాయని తెలుస్తోంది.