Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ సైన్ చేస్తూ బిజీగా ఉన్నారు. రెండేళ్ల క్రితం ‘జాను’ సినిమాతో వచ్చిన సామ్.. ఆ సినిమాతో సక్సెస్ అందుకోలేకపోయింది. అంతక ముందు నటించిన మజిలీ, ఓ బేబీ సూపర్ హిట్స్గా నిలిచాయి. కానీ, జాను పరాజయం సమంతను కాస్త వెనక్కి నెట్టింది. దాంతో బాగానే గ్యాప్ తీసుకుంది. ఈ మధ్యలో వివాహ బంధానికి స్వస్తి చెప్పి కొన్ని సమస్యలను ఎదుర్కొంది. ఇప్పుడు వాటన్నిటి నుంచి బయటపడి కెరీర్ పరంగా చాలా బిజీ అయిపోయింది. ఈ నేపథ్యం లోనే సమంత ఇప్పుడు గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే పౌరాణిక సినిమాను పూర్తి చేసింది.
ఈ పాన్ ఇండియా సినిమాతో పెద్ద స్టార్గా మారాలని తాపత్రయపడుతోంది. ఇక విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, మరో స్టార్ హీరోయిన్ నయనతారలతో కలిసి సమంత నటించిన మల్టీస్టారర్ ‘కథువాక్కుల రెండు కాదల్’. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీని తెలుగులో ‘కణ్మణి రాంబో ఖతీజా’ అనే టైటిల్ తో రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ వచ్చి ఆకట్టుకుంటోంది. ఇందులో సమంత ఖతీజా పాత్రలో సందడి చేయనుంది.
Samantha: దీని కోసం ఆమె చాలా శ్రమించిందని మేకర్స్ అంటున్నారు.
ఇక శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న యశోద సినిమాలో టైటిల్ పోషిస్తోంది సమంత. ఈ సినిమాకు హరి, హరీష్ దర్శకులు. అయితే, ఇటీవలే సమంత ఈ సినిమాలో ఉన్న కీలక యాక్షన్ సన్నివేశాలను కంప్లీట్ చేసింది. దాదాపు 10 రోజుల పాటు ఈ మూవీ షూటింగ్లో ఆమె పాల్గొనగా ఈ యాక్షన్స్ సీక్వెన్స్ను యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ కొరియోగ్రఫీ అందించారు. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాలో సమంత ఫైట్స్ కూడా అలరిస్తాయని..దీని కోసం ఆమె చాలా శ్రమించిందని మేకర్స్ అంటున్నారు.