Samantha: స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది అక్టోబర్ నెలలో మయోస్సైటీస్ వ్యాధికి గురికావడం తెలిసిందే. ఈ వ్యాధి బారిన పడటంతో దాదాపు నాలుగు నెలల పాటు సినిమా షూటింగ్స్ ఆపేసింది. ఆ టైంలో “యశోద” సినిమా డబ్బింగ్ కూడా బెడ్ పై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. దెబ్బ మీద దెబ్బ అన్న రీతిలో కెరియర్ పరంగా మంచి టైమింగ్ లో ఉన్న సమయంలో… సమంత అనారోగ్యానికి గురికావడంతో చాలా కీలకమైన ప్రాజెక్టులు మరుగున పడ్డాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిస్తున్న “ఖుషి” సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది.
మార్చి నెలలో మళ్లీ పూర్తిగా కోలుకోవడం జరిగింది. “శాకుంతలం” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా పాల్గొనడం జరిగింది. ఈనెల 14 వ తారీకు “శాకుంతలం” విడుదల కాగా సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా… ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. పాన్ ఇండియా నేపథ్యంలో ఫస్ట్ టైం సమంత పౌరాణిక తరహాలో.. శకుంత పాత్రలో పెద్దగా మెప్పించలేకపోయింది. విజువల్ వండర్ గా చేయాలని భారీ ఖర్చు చేసినా గాని ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. ఇదిలా ఉంటే సమంత తర్వాత ఇప్పుడు ఒప్పుకున్న ప్రాజెక్టులను కంప్లీట్ చేసే పనిలో ఉంది. కానీ ఇప్పుడు మళ్లీ మరోసారి సమంత అనారోగ్యానికి గురి కావడం జరిగింది అంట.
మయాసైటిస్ వ్యాధికి చికిత్సలో భాగంగా హైపర్ భారిక్ థెరపీకి సంబంధించిన ఫోటో ఇన్ స్తాలో షేర్ చేయడం జరిగింది. దీనివల్ల శరీరంలో డ్యామేజింగ్ టిష్యులు మెరుగుపడతాయని పేర్కొన్నారు. సమంత ఫోటో చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరింత త్వరగా కోలుకొని మునుపటి మాదిరిగా అలరించాలని… మరింత వేగంతో సినిమాలు ఒప్పుకుని ఇంకా విజయాలతో దూసుకుపోవాలని వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు వెళ్లాలని… ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సమంత దక్షిణాదిలో కొన్ని సినిమాలతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో.. ఓ వెబ్ సిరీస్ చేస్తూ ఉంది. దక్షిణాదిలో విజయ్ దేవరకొండతో “ఖుషి” సినిమా… దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది.