Samantha: ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కొద్ది నెలల క్రితమే భర్త నాగచైతన్యతో విడిపోయి తన దారి తాను చూసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెరీర్పైనే ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ.. భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్ను టేకప్ చేస్తూ కెరీర్ పరంగా దూకుడు చూపిస్తోంది. అయితే తాజాగా ఏమైందో ఏమో గానీ.. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సమంత ఓ సంచలన పోస్ట్ పెట్టింది.
`నా నిశ్శబ్దాన్ని తెలియనితనంగా.. నా మౌనాన్ని అంగీకారంగా.. నా దయని బలహీనతగా ఎప్పుడూ చూడకండి. .నా దయాగుణం నశించే రోజూ కూడా ఉంటుంది` అని ట్వీట్ చేసింది. మళ్లీ ఇదే ట్వీట్ను రీట్వీట్ చేస్తూ `మంచితనానికి ఒక హద్దు ఉంటుంది. జస్ట్ సేయింగ్` అంటూ రాసుకొచ్చింది. ఈ ట్వీట్ చూస్తుంటే ఎవరికో వార్నింగ్ ఇచ్చినట్లుగానే కనిపిస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కానీ, సమంత వార్నింగ్ ఇచ్చింది ఎవరికి..? అసలు ఏం జరిగింది..? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇలాంటి తరుణంలో కొన్ని కారణాలు తెరపై వచ్చాయి. విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి ‘కన్మణి రాంబో ఖతీజా’ అనే సినిమా చేసింది సమంత. అయితే ఈ మూవీలోని ఓ సాంగ్ ఇటీవల బయటకు రాగా.. అందులో సామ్ మితిమీరిన గ్రామర్ ప్రదర్శన చూసి నెటిజన్లు ట్రోల్ చేశారు.
అలాగే నిన్న శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-సమంత కలిసి చేయబోయే సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గోనకపోవడంతో.. విజయ్ అభిమానులు ఆమె తప్పుబట్టారు. ఇక కాజల్ డెలివరీ తర్వాత ఆమెను చూసి సమంత నేర్చుకోవాలంటూ కొందరు విమర్శలు కురిపించారు. అయితే వీటన్నిటినీ తట్టుకోలేకే సమంత అలా ట్వీట్ చేసి ఉంటుందని భావిస్తున్నారు. కారణం ఏదైనా సమంత పోస్ట్ మాత్రం వైరల్గా మారింది.
Kindness can have an expiry date ☺️#JustSaying https://t.co/UDc40uaLpv
— Samantha (@Samanthaprabhu2) April 22, 2022