Samantha: స్టార్ హీరో సమంత ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్లో `ఖుషి` ఒకటి. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రమిది.
ఇందులో కశ్మీర్ కుర్రాడిగా విజయ్ దేవరకొండ, తమిళ అమ్మాయిగా సమంత కనిపించబోతున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కశ్మీర్లోనే జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సమంత అందుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సోసల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. ఖుషి మూవీకి గానూ సమంత రూ. 5 కోట్లు డిమాండ్ చేసిందట.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇంతకు ముందుకు ఆమె ఒక్కో సినిమాకు రూ. 3 నుంచి 4 కోట్ల వరకు తీసుకునేదని టాక్ ఉంది. అయితే ఖుషి మూవీకి సమంత తన రెమ్యునరేషన్ను మరింత పెంచేసింది. సమంతకు కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ఉండడంతో పాటు తనకు సైతం మంచి మార్కెట్ ఉంది. అందు కారణంగా ఆమె అంత మొత్తంలో డిమాండ్ చేసిందని టాక్ నడుస్తోంది.
ఇక నిర్మాతలు సైతం సమంత అడిగిన మొత్తం ఇచ్చేందుకు ఓకే చెప్పారని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. కాగా, సమంత ఇటీవలె ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో నాగచైతన్య అక్కినేనితో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ సమంత ఏదో ఒక కారణం చేత నిత్యం వార్తల్లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది.