Yashoda: సమంత నటించిన “యశోద” ఈరోజు మరికొద్ది గంటలలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల అవ్వటానికి ముందు సమంత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. “చాలా నెర్వస్ గా ఉంది. కానీ ఎక్సైట్ అవుతున్నా. ఇంకా ఒక్కరోజే ఉంది. మీ అందరికీ యశోద నచ్చాలని కోరుకుంటున్నా. మీ తీర్పు కోసం నాలాగే నా దర్శకులు మరియు నిర్మాతలు సినిమా యూనిట్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది అంటూ సోషల్ మీడియాలో సమంత పోస్ట్ పెట్టడం జరిగింది.
మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో సమంత బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమంత చికిత్స కూడా తీసుకుంటూ ఉంది. ప్రాణాపాయకరమైన ఈ వ్యాధి జయించడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీంతో ఒప్పుకున్న సినిమాలన్నిటిని పక్కన పెట్టేసి ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సమంత… “యశోద” సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. యశోద కి సంబంధించి ఓ ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఇంటర్వ్యూలో.. తనకి వచ్చిన వ్యాధి అంత భయంకరమైన స్టేజిలో ఏమీ లేదు. నా అనారోగ్యంపై వచ్చిన వార్తలు చూస్తుంటే నేను చచ్చిపోయాను అన్న తరహాలో రాస్తున్నట్టున్నారు. నేను ఇంకేమీ చనిపోలేదు.. అంటూ తన ఆరోగ్యంపై ఇష్టానుసారంగా వార్తలు రాయటాని సమంత ఖండించింది.
ఈ తరుణంలో సమంత సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలో “యశోద” సినిమా గురించి సమంత పెట్టిన లేటెస్ట్ పోస్ట్ సంచలనంగా మారింది. ఈ సినిమాలో టైటిల్ రోల్ లో సమంత కీలకమైన పాత్రలో కనిపిస్తుంది. అరుదైన వ్యాధికి సామ్ గురికావడంతో యశోద సినిమాపై ఆడియన్స్ లో సింపతి పెరిగింది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో చాలా చోట్ల సమంత కటౌట్లు ఆమె అభిమానులు కట్టడం విశేషం.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!