Samantha: ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. రీల్ లైఫ్లో హీరోయిన్గా సూపర్ సక్సెస్ అయిన సామ్.. రియల్ లైఫ్లో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. తన తొలి సినిమా హీరో అయిన యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్యను ఏడేళ్ల పాటు ప్రేమించి.. 2017లో అట్టహాసంగా వివాహం చేసుకుంది.
కానీ, పెళ్లి తర్వాత అతడితో ఎక్కువగా కాలం జీవించలేకపోయింది. నాలుగేళ్లు గడవక ముందే చైతుతో విడిపోయి తన దారి తాను చూసుకుంది. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న సమంత.. కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టి వరుస ప్రాజెక్ట్స్ను లైన్లో పెడుతూ దూసుకుపోతోంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. నిత్యం ఏదో ఒక పోస్ట్తో సందడి చేస్తుంటుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇందులో భాగంగానే తాజాగా సామ్ తన పెట్ డాగ్ సాషాతో దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ ఫొటోపై ఓ నెటిజన్ `సమంత పిల్లులు కుక్కలతో ఒంటరిగా చనిపోవాలి` అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. దీన్ని గమనించిన సామ్ వెంటనే రియాక్ట్ అవుతూ.. `అదే జరిగితే నన్ను నేను అదృష్టవంతురాలిగా భావిస్తాను` అంటూ సదరు నెటిజన్కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది.
దీంతో సామ్ చేసిన ఆ ట్వీట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. కాగా, సమంత సినిమాల విషయానికి వస్తే.. ఈమె చేతిలో `శాకుంతలం`, `యశోద`, `ఖుషి` వంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో శాకుంతలం షూటింగ్ ఎప్పుడో ఫినిష్ అవ్వగా.. మిగిలిన ఈ రెండు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. ఇక వీటితో పాటు సామ్ మరిన్ని ప్రాజెక్ట్స్కు సైతం సైన్ చేసింది.