Pushpa 2: 2021 డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన “పుష్ప” అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. సుకుమార్ బన్నీ కలయికలో ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక ఊపు ఊపింది. పుష్ప లో డైలాగులు పాటలు అన్నీ కూడా ప్రాంతాలు మరియు భాషలతో సంబంధం లేకుండా ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఇదిలా ఉంటే పుష్ప మొదటి భాగంలో ఐటెం సాంగ్.. “ఊ అంటావా.. ఊఊ అంటావా” అనే పాటలో సమంత స్టెప్పులు కూడా హైలెట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకీ కొనసాగింపుగా పార్ట్ 2 షూటింగ్ జరుపుకుంటుంది.
దీంతో పుష్ప సెకండ్ పార్ట్ లో కూడా సమంత ఐటెం సాంగ్ లో చిందు లేయనున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఇందుకుగాను పుష్ప సినిమా టీం సమంతని సంప్రదించినట్లు… వార్తలు వైరల్ అవుతున్నాయి. వస్తున్న వార్తలపై సమంత టీం క్లారిటీ ఇచ్చింది. రెండో భాగం పుష్పలో సమంత… ఏమీ నటించడం లేదని తెలియజేశారు. అసలు పుష్ప మేకర్స్ ఎవరూ కూడా సంప్రదించలేదని పేర్కొన్నారు. ఇలా ఉంటే ప్రస్తుతం మయో సిటీస్ అనే వింత వ్యాధికి గురైన సమంత ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. గత మూడు నెలలు కంటే ఇప్పుడు సమంత ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. ప్రస్తుతం సమంత చేతిలో విజయ్ దేవరకొండ తో చేస్తున్న “ఖుషి” సినిమాతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెబ్ సిరీస్ ప్రాజెక్టులు ఉన్నాయి.
ఇంకాస్త ఆరోగ్యం కుదుటపడ్డాక ఈ ప్రాజెక్టులు స్టార్ట్ చేసే అవకాశం ఉంది. మరో పక్క “పుష్ప 2” షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సంవత్సరం చివర ఆఖరిలో సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే మొదటి భాగం కంటే రెండో భాగం ఎక్కువ భాషలలో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. పుష్ప రెండో భాగం మొదటి షెడ్యూల్ విశాఖపట్నంలో జరిగింది. అక్కడ ఇంట్రడక్షన్ సన్నివేశాలతో పాటు సాంగ్ చిత్రీకరణ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.