మూడు చిత్రాలు కలిసి జంటగా నటించిన నాగచైతన్య, సమంత తర్వాత పెళ్లి చేసుకుని రియల్ లైఫ్ జంటగా మారారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం `మజిలీ` ఏప్రిల్ 5న విడుదలవుతుంది. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో సమంతలో టెన్షన్ బాగానే కనిపిస్తోంది.
సినిమా సక్సెస్ కావాలని ఆమె దేవుళ్లందరినీ మొక్కుకుంటోంది. మొక్కులు తీర్చుకుంటున్నది. మొక్కులో భాగంగా సోమవారం రాత్రి సమంత అలిపిరి నుండి కాలినడకన తిరుమల చేరుకున్నారు. అభిమాన తార సమంత అలా ప్రత్యక్షం కావడంతో ఆశ్చర్యానికి గురైన అభిమానులు కూడా ఆమెతో కలిసి నడిచారు.