Samantha: సమంత – నాగచైతన్య జంట విడాకులు అయిపోయి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అక్కినేని అభిమానులు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వీరు విడిపోయిన తరువాత ఎవరికి వారు తమ కెరీర్ విషయంలో ముందుకు వెళ్తూ బిజీగా గడిపేస్తున్నారు. అయితే వారివారి సినిమాల విషయంలో సామ్ వర్సెస్ చై అంటూ ఒక సెక్షన్ మీడియా రకరకాల కథనాల్ని అదేపనిగా ప్రచురిస్తోంది. ఇప్పటికే సామ్ పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకోగా ప్రస్తుతం చైతన్య పాన్ ఇండియా ప్రయత్నాల్లో వున్నాడు. అందులో భాగంగానే బాలీవుడ్ స్టార్లతో కలిసి మల్టీస్టారర్ల ప్రయత్నాలు చేస్తున్నాడని గుసగుసలు వినబడుతున్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సామ్ vs చే:
అమీర్ ఖాన్ – కరీనా కపూర్ నటించిన లాల్ సింగ్ చద్దాతో చైతూ బాలీవుడ్ లో అడుగుబెట్టబోతున్న విషయం తెలిసినదే. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన కూడా వచ్చింది. ఈ ట్రైలర్ లో చైతన్య కొన్ని క్షణాలు అలా మెరిసిన సంగతి తెలిసినదే కదా. అందువలన అక్కినేని అభిమానులు తీవ్రంగా మానసిక క్షోభ అనుభవించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. చైతన్యకు ఇది సరైన లాంచ్ కాదంటూ ఒక సెక్షన్ అప్పుడే ప్రచారం కూడా చేస్తోంది. నిజానికి సమంత `ఫ్యామిలీమ్యాన్ 2`తో ఉత్తరాదిన దూసుకుపోయిన సంగతిని గుర్తు చేస్తుకుంటూ సో కాల్డ్ అభిమానులు చే విషయంలో నిరాశగా వున్నారని భోగట్టా.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఓ వర్గం వారికి అందుకే జీర్ణం కావడంలేదు?
సమంత ఇప్పటికే నటిగా టాలీవుడ్లో సూపర్ సక్సెస్ అయింది. ఇపుడు పాన్ ఇండియా స్థాయిలో కూడా ఆమెకు బోలెడంత మైలేజ్ వచ్చింది. ఫామిలీ మ్యాన్ సిరీస్లో రాజీ అనే ఎల్.టి.టి.ఇ ఉగ్రవాది పాత్రతో మెప్పించింది. అంతేకాదు.. దానితరువాత వచ్చిన ‘పుష్ప’ సినిమాలో సామ్ చేసిన ఐటెం సాంగ్ కి మంచి ఆదరణే లభించింది. దీంతో సామ్ కి బోలెడంత గుర్తింపు దక్కింది. కానీ చైతూ గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడుకోవడం లేదు. లాల్ సింగ్ చద్దాలో అతడి ప్రాధాన్యత ఎంత? అన్నది ప్రశ్నగా మారిందంటూ ఒక సెక్షన్ మీడియా ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు అనేకమంది చే కంటే సామ్ ఆ విషయంలో ముందంజలో ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం ఇపుడు ఓ వర్గం వారికి జీర్ణం కావడంలేదు!