అర్జున్ రెడ్డితో తెలుగులో.. కబీర్ సింగ్తో బాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఓ వెబ్సిరీస్ను డైరెక్ట్ చేస్తారని వార్తలు వినిపించాయి. బాలీవుడ్ నిర్మాత రోనీ స్కూనీవాలా తెలుగులో లస్ట్ స్టోరీస్ను నిర్మించడానికి ముందుకు వచ్చారు. సందీప్ వంగా, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి ఈ లస్ట్ స్టోరీస్ను తెరకెక్కిస్తారని టాక్. అందులో నందిని రెడ్డి తన పార్ట్ను జగపతిబాబు, అమలాపాల్లపై చిత్రీకరించారని వార్తలు వచ్చాయి. అయితే తాను తెలుగు లస్ట్ స్టోరీస్ను తెరకెక్కిస్తానని వస్తున్న వార్తలు నిజం కాదని సందీప్ వంగా తెలిపారు. తెలుగులో లస్ట్ స్టోరీస్ను తెరకెక్కించమని కొందరు వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు. అయితే నేను ఆ వెబ్సిరీస్ను తెరకెక్కించలేదనని చెప్పాను. అయితే కొన్ని నిజ జీవితాలను ఆధారంగా చేసుకుని ఐదేళ్ల తర్వాత ఓ వెబ్ సిరీస్ను తెరకెక్కిస్తాను. ఐదుగురు స్నేహితుల చుట్టూ తిరిగే ఈ కథను సినిమాగా తీస్తే సెన్సార్ వాళ్లు అంగీకరించరు. అందుకని ఆ కథతో వెబ్సిరీస్ను తెరకెక్కించాలనుకుంటున్నాను“ అని సోషల్ మీడియా వేదికగా సందీప్ వంగా తెలిపారు.
previous post
next post