Sandeep reddy vanga: ఒక్క అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్లో క్రేజీ డైరెక్టర్గా మారాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో
హీరో విజయ్ దేవరకొండకు టాలీవుడ్లో విపరీతమైన మాస్ ఇమేజ్ వచ్చింది. అంతేకాదు, ఈ సినిమా చూసిన బాలీవుడ్ మేకర్స్ కూడా విజయ్ హీరోగా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్స్కు విజయ్ క్రేజ్ తెగ నచ్చేసింది. అందుకే తనతో కలిసి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసేందుకు రెడీ అంటున్నారు. ఇక అర్జున్ రెడ్డి సినిమానే హిందీలో కబీర్ సింగ్ అని షాహిద్ కపూర్, కియారా అద్వానీలతో తీసి అక్కడ కూడా భారీ హిట్ అందుకున్నాడు సందీప్ రెడ్డి వంగ.
ఇప్పుడు ఆయన హిందీలో క్రేజీ డైరెక్టర్గా మారాడు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్తో యానిమల్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా పరిణీతి చోప్రా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉండగా దానికోసం రష్మిక మందన్నను తీసుకోవాలని సందీప్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ తర్వాత టాలీవుడ్లో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ను ఇప్పటికే ఫిక్స్ చేశారు. ఇది పాన్ ఇండియన్ సినిమాగా రానుంది.
Sandeep reddy vanga: ఇద్దరు కలిసి ఓ పాన్ ఇండియా సినిమాను చేసేందుకే ఈ మీటింగ్..!
ఇదే క్రమంలో సందీప్ రెడ్డి వంగా అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమాను రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల బన్నీ ముంబై వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ సంజయ్ లీలా భన్సాలీని కలిసి ఓ ప్రాజెక్ట్ విషయంలో చర్చలు జరిపాడు. అలాగే, సందీప్ రెడ్డి వంగాతోనూ బన్నీ మీటింగ్ వేశాడు. ఇద్దరు కలిసి ఓ పాన్ ఇండియా సినిమాను చేసేందుకే ఈ మీటింగ్ అని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. అర్జున్ రెడ్డి తర్వాత టాలీవుడ్ హీరోల చుట్టూ తిరిగిన ఈ దర్శకుడికి ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్స్ చేసే అవకాశం అందుకోవడం ఆసక్తికరంగా మారింది.