మహేశ్ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. దిల్రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది. సంక్రాంతి సందర్భంగా సినిమాను జనవరి 11న విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను జనవరి 5న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటిస్తునారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. మహేష్ ఈ చిత్రంలో అజయ్ అనే మిలటరీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ప్రకాశ్రాజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!