సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదలకు సిద్ధమవుతోంది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా తుదిమెరుగులద్దుకుంటోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవిశ్రీ సంగీమందించాడు.
ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ వచ్చేనెల 5న జరగనున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారని సమాచారం. ఇప్పటికే సినీ నిర్మాతలు చిరుతో మాట్లాడారని తెలుస్తోంది. దీనికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేశ్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు అభిమానులను అలరిస్తున్నాయి.