SVP: సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `సర్కారు వారి పాట`. గీత గోవిందం సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించారు.
ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ మే 12న వరల్డ్ వైడ్ గా విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. మొదటి రోజు టాక్ తేడాగా వచ్చినా.. ఆ తర్వాత మైత్రీ వారు చేసిన ప్రమోషన్స్తో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ను రాబడుతూ దుమ్ము దులిపేస్తోంది. ఓవర్సీస్లోనూ ఈ మూవీ నయా వసూళ్లను కొల్లగొట్టింది. అయితే ఇంతకీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిందా..? లేదా..? అన్న విషయంపై పెద్ద కన్ఫూజన్ నెలకొంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విడుదలై ఇరవై రోజులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ను రీచ్ అవ్వలేకపోయింది. ఇంకా బాక్సాఫీస్ కు బాకీయే ఉంది. వరల్డ్ వైడ్గా రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సర్కారు వారి పాట.. రూ. 121 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఇరవై రోజుల్లో ఈ మూవీ రూ. 108.98 కోట్ల షేర్ ను రాబట్టింది. క్లీన్ హిట్గా నిలవాలంటే ఇంకా రూ. 12.02 కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉంది. ఇక ఏరియాల వారీగా సర్కారు వారి పాట 20 రోజుల టోటల్ కలెక్షన్స్ ను ఓ సారి గమనిస్తే..
నైజాం: 33.43 కోట్లు
సీడెడ్: 11.58 కోట్లు
ఉత్తరాంధ్ర: 12.54 కోట్లు
తూర్పు: 8.51 కోట్లు
పశ్చిమ: 5.62 కోట్లు
గుంటూరు: 8.46 కోట్లు
కృష్ణ: 5.83 కోట్లు
నెల్లూరు: 3.49 కోట్లు
———————-
ఏపీ+తెలంగాణ= 89.46 కోట్లు(135.20 కోట్లు~ గ్రాస్)
———————-
రెస్ట్ ఆఫ్ ఇండియా+కర్ణాటక: 6.90 కోట్లు
ఓవర్సీస్: 12.62 కోట్లు
————————
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్= 108.98 కోట్లు(175.65 కోట్లు~ గ్రాస్)
————————