Sarkaru Vaari Paata: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు రెండేళ్ల తర్వాత మళ్లీ `సర్కారు వారి పాట`తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించగా.. పరశురామ్ దర్శకత్వం వహించాడు. సముద్రఖని ఇందులో విలన్గా చేయగా.. నదియా, వెన్నెల కిషోర్, సౌమ్య మీనన్, సుబ్బరాజు, అజయ్, బ్రహ్మాజి, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలను పోషించారు.
నవీన్ యెర్నేని, రవి శంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ మూవీకి నిర్మాతలుగా వ్యవహరించగా.. తమన్ స్వరాలు అందించారు. సంక్రాంతికే విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడి చివరాఖరకు నేడు విడుదలైంది. బ్యాంకులు, ఈఎంఐలు, అప్పుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అమెరికాలో వడ్డీ వ్యాపారం చేసుకునే మహిగా మహేష్ అదరగొట్టేశాడు. మహేష్ పర్ఫార్మెన్స్, లుక్స్, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మిస్మరైజ్ చేశాయి. కీర్తి సురేష్తో ఆయన లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకుంది. మొత్తానికి టాక్ బాగానే ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని అంటున్నారు. ఇకపోతే మహేష్ కి ఇక్కడ మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. యూఎస్ లో మహేష్ రికార్డును టాలీవుడ్లో ఏ హీరో చెరపలేకపోయారు.
ఆయన నటించిన ఎనిమిది సినిమాలు అక్కడ వన్ మిలియన్ వసూళ్లు సాధించాయి. అయితే సర్కారు వారి పాటతో మహేష్ మరోసారి మెంటల్ మాస్ జాతర చూపించాడు. కేవలం ప్రీమియర్స్ తోనే ఈ మూవీ ఆ మ్యాజిక్ ఫిగర్ కి చేరువైంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీమియర్స్ లోనే 9 లక్షల డాలర్స్ మార్క్ ని దాటేసినట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఇంకా కొన్ని ఏరియాల కలెక్షన్స్ రిపోర్ట్ అందాల్సి ఉండగా… 1 మిలియన్ డాలర్స్కి చేరుకున్నట్లే అంటున్నారు. మొత్తానికి తన అడ్డాలో మహేశ్ దుమ్ము దులిపేశాడని చెప్పాలి.