Sarkaru Vaari Paata: `సరిలేరు నీకెవ్వరు` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న చిత్రం `సర్కారు వారి పాట`. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మహేష్కు జోడీగా నటిస్తోంది. అలాగే యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కీలక పాత్రను పోషిస్తుండగా.. తమన్ స్వరాలు అందిస్తున్నాడు.
మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక సాంగ్ మినహా మిగిలిన షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మే 12న గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఏప్రిల్ ఆఖరి వారం నుండీ ఈ సినిమా ప్రమోషన్స్ సైతం షురూ కానున్నాయి.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయట. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. నైజాంలో రూ. 30 కోట్ల మేర బిజినెస్ చేసిన సర్కారు వారి పాటకి ఆంధ్రరాష్ట్రంలో రూ. 50కోట్ల వరకు బిజినెస్ జరిగిందట.
మొత్తంగా రెండు తెలుగు రాష్రాల్లో కలిపి రూ. 80కోట్ల వరకు బిజినెస్ జరిగిందని టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే ఈసారి మహేష్ బాబు బాక్సాఫీస్ టార్గెట్ పెద్దగానే ఉంటుంది. కాగా, బ్యాంకింగ్ మోసాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం మహేష్ బాబు బ్యాంక్ మేనేజర్ తనయుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. దీంతో ఈ సినిమాకు అభిమానులే కాకుండా సినీ ప్రియులు సైతం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.