Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం `సర్కారు వారి పాట`. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్కు జోడీగా కీర్తి సురేష్ నటించగా.. పవర్ ఫుల్ విలన్ పాత్రను సముద్రఖని పోషించారు. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది.
`మహి ఫైనాన్స్ కార్పోరేషన్` పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేసుకునే వ్యక్తిగా మహేశ్ నటిస్తే.. కాసినోలో పేకాట ఆడుతూ లైఫ్ ను ఎంజాయ్ చేసే కళావతిగా కీర్తి మెరిసింది. వీరిద్దరి రొమాంటిక్ ట్రాక్ సూపర్గా వర్కోట్ అయింది. లవ్ .. కామెడీ .. ఎమోషన్ .. యాక్షన్ తో కథను బోర్ కొట్టించకుండా కథను నడిపించడంలో పరశురామ్ బాగానే సక్సెస్ అయ్యాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తమన్ అందించిన హుషారైన సంగీతం కూడా ఆకట్టుకుంది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకుల్లో ఎక్కువ శాతం మంది పాజిటివ్ రివ్యూలే ఇస్తున్నారు. అంతేకాదు, మహేష్ ఖాతాలో మరో హిట్ ఖాయమని బలంగా టాక్ వినిపిస్తోంది. ఇకపోతే కరోనా వచ్చిన తర్వాత థియేటర్స్లో విడుదలైన చిత్రాలన్నీ మళ్లీ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే `సర్కారు వారి పాట` డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందట. రూ. 40 కోట్లు చెల్లించి అమెజాన్ వారు సర్కారు వారి పాట డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను సొంతం చేసుకుందని టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సిందే.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!