Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ముందు వరుసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ విజయాలు సాధించటంతో “సర్కారు వారి పాట” పై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ గెటప్ ఈ మూవీలో చాలా డిఫరెంట్ గా ఉండటం సినిమా పై మరింత ఇంట్రెస్ట్ పెంచేశాయి. అంతేకాకుండా సినిమాకి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ చూసి చాలా మంది సినిమా కాన్సెప్ట్ ఏంటి అన్నదానిపై సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ దుబాయ్ లో దాదాపు రెండు నెలల పాటు చాలా శరవేగంగా సాగిన సంగతి తెలిసిందే. హీరోయిన్ కీర్తి సురేష్.. మహేష్ లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. అయితే వెంటనే తర్వాత కరోనా సెకండ్ వేవ్ రావడంతో పరిస్థితులు మొత్తం తారుమారు అయిపోయాయి. దీంతో దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు వైదొలిగిన వెంటనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి ఎట్టి పరిస్థితిలో వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ తాజాగా డిసైడ్ అయినట్లు సమాచారం.
సంక్రాంతి పండుగకు అనగా జనవరి 12వ తారీకు రిలీజ్ చేయాలని.. నిర్మాతలు డిసైడ్ అయ్యారట. ఈ క్రమంలో ముందుగానే థియేటర్లు లాక్ చేసుకోవడానికి.. సినిమా యూనిట్ రెడీ అయినట్లు.. ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి నెక్స్ట్ సినిమా మొదలు పెట్టే యాలని మహేష్ చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ పరిణామంతో ఈ ఏడాదిలో మహేష్ సినిమా రానట్టే అని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతుంది.