Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు” సినిమా తర్వాత చేస్తున్న సినిమా “సర్కారు వారి పాట”. “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సినిమాలో సరికొత్త మేకోవర్ తో మహేష్ బాబు కనిపించడంతో..ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అప్పుడే సినిమాపై ఆడియన్స్ కి ఆసక్తి పెరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ బాణీలు అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో “సర్కారు వారి పాట” సినిమా విశేషాల గురించి ఇటీవల ఓ కార్యక్రమంలో వీక్షకులతో పంచుకున్నారు. సర్కారు వారి పాట సినిమాలో ఐదు సాంగ్స్ ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే 3 సాంగ్స్ కంప్లీట్ చేయడం జరిగింది అని పేర్కొన్నాడు. మొత్తం కూడా మాస్, కమర్షియల్ సాంగ్స్ అని తెలిపారు. మహేష్ అభిమానులకు కావాల్సిన ఎంటర్టైనింగ్ స్టాఫ్.. సినిమాలో ఉంటుంది అని పేర్కొన్నారు. ఇదే తరుణంలో సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కి స్పేస్ ఉంది.. ఈ విషయం గురించి ఆల్రెడీ ఇప్పటికే డైరెక్టర్ పరశురామ్ తో చర్చించడం జరిగింది.
మరి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చివరాకరికి తెలియాల్సి ఉంది.. అంటూ తమన్ మహేష్ “సర్కారు వారి పాట” సినిమా విశేషాలు తెలియజేశారు. ఫస్ట్ టైం మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తూ ఉంది. వచ్చే నెల 31 వ తారీకు కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా.. సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు.. సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం. ప్రతి సంవత్సరం కృష్ణ పుట్టినరోజు నాడు .. తాను చేయబోయే సినిమాకు సంబంధించి .. ఫస్ట్ లుక్ గాని టీజర్ గాని రిలీజ్ చేయటం మహేష్ సెంటిమెంట్.