Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. ఇందులో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్గా నటించగా.. సముద్రఖని విలన్గా చేశారు. నదియా, వెన్నెల కిషోర్, సౌమ్య మీనన్, సుబ్బరాజు, అజయ్, బ్రహ్మాజి, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలను పోషించారు.
మే 12న వరల్డ్ వైడ్గా విడుదల అయిన ఈ చిత్రం.. తొలి రోజు మిశ్రమ స్పందనను దక్కించుకున్నా ఆ తర్వాత మాత్రం సూపర్ టాక్తో బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేసింది. లవ్, కామెడీ, ఎమోషన్, యాక్షన్ తో కథను బోర్ కొట్టించకుండా కథను నడిపించిన తీరు ఆకట్టుకుంది. మహేశ్, కీర్తిలు తమదైన నటనతో ప్రేక్షకులను మిస్మరైజ్ చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మొత్తానికి వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఆ చిత్రం.. వర్కింగ్ డేలో ఎంటర్ అయిన తర్వాత హెవీ డ్రాప్స్ ను చూస్తోంది. ఈ సినిమా కి పెంచిన టికెట్ హైక్స్ ని అస్సలు తగ్గించక పోవడంతో ఆ ఇంపాక్ట్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై గట్టిగానే పడింది. దీంతో దాదాపు డబ్బై శాతం డ్రాప్స్ కనిపించాయి.
టికెట్ రేట్స్ హైగా ఉండటంతో.. ప్రేక్షకులు థియేటర్స్కు కదలడం లేదు. అయితే నేటి నుంచి పెరిగిన టికెట్ రేట్స్ తగ్గనున్నాయి. మళ్లీ మనుపటి ధరల్లోనే సినిమా స్క్రీనింగ్ కానుంది. ఇక తగ్గిన టికెట్ రేట్స్తో ఈ చిత్రం మాస్ పీపుల్తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా థియేటర్లలోకి తీసుకొచ్చే అవకాశాలు భారీగా ఉన్నాయని, ఇది ఒక రకంగా మహేశ్కు కలిసొచ్చే అంశమే అని అంటున్నారు.