SVP: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `సర్కారు వారి పాట`. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించారు.
ఇందులో దర్శకనటుడు సముద్రఖని విలన్గా చేయగా.. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వరాలు అందించాడు. కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ మూవీ మే 12న విడుదలైంది. లవ్, కామెడీ, ఎమోషన్, యాక్షన్ తో బోర్ కొట్టించకుండా కథ నడవడంతో.. ప్రేక్షకులను ఈ చిత్రం బాగానే అలరించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో భారీ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ సినిమా.. అదే జోరును కొనసాగిస్తూ వెళ్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ ఈ మూవీ రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 12 రోజుల్లోనే రూ. 200 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసి అదరగొట్టేశాడు. యూఎస్ లోనే $2.3 మిలియన్ ప్లస్ వసూళ్లను రాబట్టడం విశేషం.
కాగా, సర్కారు వారి పాట అనంతరం మహేశ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా అలరించబోతోంది. ఇక ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయిన వెంటనే మహేశ్ దర్శకధీరుడు రాజమౌళితో ఓ సినిమా చేయనున్నాడు.