Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘సర్కారు వారి పాట’. సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వస్తున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్న మూవీకి డైరెక్టర్ పరుశురామ్ పెట్లా హ్యాట్రిక్ సక్సెస్లతో మాంచి ఊపు మీదున్న మహేష్ నుంచి రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు సర్కారు వారి పాట సినిమా నుంచి ప్రమోషనల్ కంటెంట్కు అభిమానుల నుంచి ప్రేక్షకుల నుంచి సాలీడ్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ మూవి నుంచి మహేశ్ ఫస్ట్ లుక్ పోస్టర్, బ్లాస్టర్ టీజర్ మహేశ్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘కళావతి’ పాట యూట్యూబ్ లో 12 కోట్ల వ్యూస్ను రాబట్టి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన పెన్నీ సాంగ్ కూడా బాగానే ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ఉగాది పండుగ సందర్భంగా సర్కారు వారి పాట సినిమా నుంచి మహేశ్ బాబు కొత్త లుక్ను మేకర్స్ వదిలారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఒక్కడు, పోకిరి లాంటి సినిమాలు గుర్తొస్తున్నాయి.
Sarkaru Vaari Paata: గోవాలో తెరకెక్కించిన యాక్షన్ సీన్ ..!
మహేశ్ ఇంతక ముందు చెప్పినట్టుగానే సర్కారు వారి పాట సినిమా విషయంలో పోకిరి వైబ్స్ కనిపిస్తున్నాయి. మహేశ్ నుంచి అభిమానులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉండబోతున్నాయని అర్థమవుతోంది. ఇక తాజాగా వదిలిన పోస్టర్లో మహేశ్ బీచ్లో విలన్లను చితక్కొట్టేలా యాక్షన్స్ కంప్లీట్ చేసినట్టు అర్థమవుతోంది. ఇది గోవాలో తెరకెక్కించిన యాక్షన్ సీన్ అని తెలుస్తోంది. మొత్తానికి తాజాగా వచ్చిన పోస్టర్తో ఈ మూవీపై మరో రేంజ్లో అంచనాలు పెరిగేలా చేశాయి. ఇక ఈ సినిమాలో సముద్ర ఖని – ప్రకాష్ రాజ్ – వెన్నెల కిషోర్ – సుబ్బరాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.