Sarkaru Vaari Paata Trailer: `సరిలేరు నీకెవ్వరు` వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన తాజా చిత్రం `సర్కారు వారి పాట`. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించగా.. పరుశురామ్ దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ మే12న విడుదల కాబోతోంది.
ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా.. మరింత హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ వరుస అప్డేట్స్ ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సర్కారు వారి పాట థియేట్రికల్ ట్రైలర్ను బయటకు వదిలారు. `నా ప్రేమను దొంగిలించగలవ్.. నా స్నేహాన్నీ దొంగిలించగలవ్.. కానీ నువ్వు నా డబ్బుని మాత్రం దొగించలేవ్` అంటూ మహేష్ బాబు చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం విశేషంగా ఆకట్టుకుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కీర్తి సురేశ్-మహేశ్ బాబుల లుక్స్, వారి మధ్య రొమాంటిక్ సీన్స్, అలరించే డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయని చెప్పాలి. `అమ్మాయిలను అప్పు ఇచ్చేవాళ్లను పాంపర్ చేయాలిరా.. రఫ్ గా హ్యాండిల్ చేయకూడదు`, `నేను విన్నాను.. నేను వున్నాను..`, `దిస్ ఈజ్ మహేశ్.. రిపోర్టింగ్ ఫ్రమ్ చేపలపూడి బీచ్ సర్` వంటి డైలాగ్స్ మహేశ్ మెంటలెక్కించేశాడు.
కామెడీ, లవ్, యాక్షన్.. ఇలా అన్నీ సినిమాలో ఉండబోతున్నారని ట్రైలర్ బట్టీ స్పష్టంగా అర్థమైంది. మొత్తానికి అద్భుతంగా ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై హైప్ను వేరె లెవల్కి తీసుకెళ్లింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా, బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న భారీ కుంభకోణం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సముద్ర ఖని విలన్ గా కనిపించబోతుండగా.. తమన్ స్వరాలు సమకూర్చాడు.